*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 277వ డివిజన్ మహాదేవపురం పరిధిలోని దేవేందర్ నగర్, గాజులరామారం సర్కిల్లో ఏ ఈ ఆర్ ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) హెల్ప్ డిస్క్ కార్యక్రమాన్ని సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియను బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని అధికారులను కోరారు. ప్రజలు కూడా బీఎల్ఓలు అందజేసే ఎన్యుమరేషన్ ఫారమ్లను సక్రమంగా పూర్తి చేసి సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హులైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సిద్ధునోళ్ల సంజీవ్ రెడ్డి, డీసీసీ సెక్రటరీ గణేష్, ఐఎన్టీయూసీ నాయకుడు డేగుల సతీష్ బాబు, లలిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Telangana
*స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) హెల్ప్ డిస్క్ను పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి* :
Quick Summary:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని