నేటి సాక్షి జూన్ 10 నంద్యాల :-
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కరించాలని పీఆర్టీయూ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి . భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి లు డిమాండ్ చేశారు.బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పీఆర్టీయూ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి లు పాల్గొని వివిధ ఉపాధ్యాయ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు ప్రాతినిధ్యం వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని,30% మధ్యంతర భృతి చెల్లించాలని అన్నారు.సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెమో 57 అమలు పరుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.పెండింగ్ డిఏ లలో, కనీసం రెండు తక్షణమే విడుదల చేయాలని తెలిపారు.సీపీఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ విడుదల చేయాలని,2022 నుంచి పెండింగ్ లో వున్న సరెండర్ లీవ్ నగదు చెల్లించాలని సూచించారు.
పెండింగ్ ఏపీజీఎల్ఐసీ క్లెయిమ్స్ చెల్లించాలని,
ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి, పర్యవేక్షణ పోస్టులైన ఎంఈవో,డిప్యూటీ డీఈవో డైట్, ఐఏఎస్ఈ, ఎస్సీఈఆర్టీ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు.
ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 2025` రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉపాధ్యాయుల క్యాడర్ ఆర్గనైజేషన్ చేయాలని,
టెట్ నుంచి మినహాయింపు` సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా, 5 ఏళ్లు పైబడి సర్వీస్ కలిగిన టీచర్లకు టెట్ తప్పనిసరి అయినందున, 2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోసం విద్యా హక్కు చట్టం సెక్షన్ 21(2) కి చట్ట సవరణ చేయాలన్నారు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఆఫ్లైన్ లో ప్రత్యేక టెట్ నిర్వహించాలని సూచించారు.
అందరికీ అర్హత మార్కులు 35% గా నిర్ణయించాలని తెలిపారు.
40% జే.ఎల్. కోటా పదోన్నతులు పాఠశాల విద్యను, ఉన్నత విద్యను విలీనం చేసి, ఒకే శాఖ విద్యాశాఖ నిర్వహించాలి. జీవో నం.223ను రద్దు చేసి,జీవో నం.302 పునరుద్ధరణ చేసి 40% జేఎల్ పదోన్నతులు స్కూల్ అసిస్టెంట్లకు కల్పించాలని,
ఉపాధ్యాయుల సర్దుబాటు` ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీలు లేనందున, చేపట్టబోయే ఉపాధ్యాయుల సర్దుబాటుకు జూన్ 30 నాటికి విద్యార్థుల ఎన్రోల్మెంట్ ప్రామాణికంగా తీసుకోవాలని అన్నారు.
2025 ఉపాధ్యాయ బదిలీల్లో బదిలీ అయ్యి, ఇంతవరకు రిలీవ్ కాని ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని సూచించారు.
మోడల్ ప్రైమరీ పాఠశాలలో సర్దుబాటు చేపట్టరాదని అన్నారు.గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ సీఆర్టీ ల సేవలను రెన్యువల్ చేయాలని,మెడికల్ బిల్లుల మంజూరుకు ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు వివరించారు, ఈ సమావేశంలో జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Andhra
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేసిన పీఆర్టీయు.:- పీఆర్టీయూ
Quick Summary:
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని...